Harinama Kshetram
శ్రీ వేంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో
‘హరినామ క్షేత్రం’
తిరుమల ఆలయ ప్రతిరూప నిర్మాణం
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆదేశంచే సిద్ధిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామములో 7 ఎకరముల విశాల ప్రాంగణములో ‘హరినామ క్షేత్రం’ పేరుతో తిరుమల ఆలయ ప్రతిరూపం (వెండివాకిలి) నిర్మాణ కార్యక్రమము 02.07.2026 నుండి శంకుస్థాపనతో ప్రారంభమైంది.
స్వామివారి దివ్య వాక్కు ప్రకారం, భవిష్యత్తులో ఈ క్షేత్రం ఒక దివ్యదేశంగా భక్తులకు ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదించును. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని బహిర్గత పరచుటకు మరియు భక్తులను ఈ ‘క్షేత్రము’లో భాగస్వాములుగా చేర్చుటకు, స్వామివారు 2000 సంవత్సరం నుండి ప్రసాదిస్తున్న వేలాది అనుభూతులను మా ‘శ్రీవేంకటేశం’ మాసపత్రికలో ఏప్రిల్ 2023 నుండి ‘దివ్య నిర్దేశం’ అనే శీర్షికతో ధారావాహికంగా ప్రచురిస్తున్నాము.
ఇలాంటి మహాభాగ్యం జన్మజన్మలకైనా లభించదు. మనకు లభించిన ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం! ఆలయ నిర్మాణం ఒక మహా యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ ఒక సమిధలాగా ఆలయ నిర్మాణంకై శక్తికొలది విరాళం అందించి శ్రీనివాసుని సేవలో భాగస్వాములం అవుదాం!
మనతో రానిది సంపద.. మనతో వచ్చేది శ్రీహరి సేవ మాత్రమే. మీ విరాళమే శ్రీవేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి బంగారు ఇటుక. ఈ సేవలో మీరు కూడ భాగస్వాములుకండి.. హరినామ క్షేత్ర నిర్మాణానికి మీవంతు సహాయాన్ని అందించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అపార కృపను పొందండి.
గోవింద… గోవింద… శ్రీవేంకటేశ… గోవింద…